Home EXCLUSIVE YS Sharmila : పిల్లలను చూసి గర్వించిన షర్మిల.. కీలక మైలురాయిని దాటడంపై హర్షం

YS Sharmila : పిల్లలను చూసి గర్వించిన షర్మిల.. కీలక మైలురాయిని దాటడంపై హర్షం

27
YS Sharmila
YS Sharmila

YS Sharmila : వైఎస్ షర్మిల పిల్లలు రాజారెడ్డి, అంజలీ రెడ్డి విదేశాల్లో చదువుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా రాజారెడ్డి, అంజలీ రెడ్డి ఇద్దరూ తమ అకడమిక్ విధులను పూర్తి చేసుకొని కీలక మైలురాయిని చేరుకున్నారు.
YS Sharmila

తన ఇద్దరు పిల్లలు కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని వైఎస్ షర్మిల ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. రాజారెడ్డి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనాలిసిస్ పట్టా పొందగా, అంజలీ రెడ్డి బీబీఏ ఫైనాన్స్ పట్టా పొందారు.

షర్మిల ఎక్స్ లో ఈ రోజు (డిసెంబర్ 20)న ట్వీట్ చేశారు ‘నా ఇద్దరు పిల్లల విద్యా మైలురాళ్లను విజయవంతంగా దావటారని ప్రకటించడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ సాధించిన నా కుమారుడు రాజారెడ్డికి, బీబీఏ ఫైనాన్స్ డిగ్రీ సాధించిన నా కుమార్తె అంజలీ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు.’ అంటూ రాసుకున్నారు.

షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్, తల్లి వైఎస్ విజయమ్మ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లగా, ఈ సందర్భంగా వారు సంతోషకరంగా ఆనందంగా పిల్లలతో గడిపారు. వారు అక్కడ దిగిన ఫొటోలను వైఎస్ షర్మిల ట్విటర్ లో పోస్ట్ చేసుకున్నారు.

త్వరలో రాజారెడ్డి పెళ్లి వేడుకలు ప్రారంభం కానుండడంతో వైఎస్ కుటుంబంలో ఆనందం మరింత పెరగనుంది. తన చిరకాల ప్రేయసి, చట్నీస్ యజమాని అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలు ప్రియా అట్లూరిని రాజారెడ్డి వివాహం చేసుకోబోతున్నాడు. దీనికి ఇరు కుటుంబాల వారు అంటీకరించినట్లు తెలిసింది. త్వరలో షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.