Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు షర్మిల అన్న జగన్ కోసం అహర్నిశలు కష్టపడింది. పాదయాత్రలు చేసింది. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసింది. అప్పటికే రాష్ట్రము విడిపోవడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఆగ్రహంతో ఉన్నారు. అటువంటి వారిని అందరిని వైసీపీ తన గూటికి చేర్చుకుంది. ఒకవైపు చెల్లెలు కష్టం, మరోవైపు కాంగ్రెస్ వారందరు జగన్ శిబిరంలో చేరడంతో జగన్ సీఎం అయ్యారు. దింతో కాంగ్రెస్ శిబిరం దాదాపుగా ఖాళీ అయ్యింది. అప్పుడు అన్నకోసం కష్టపడిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొంది. అప్పుడు వెళ్లిపోయిన వారంతా నేడు షర్మిలను నమ్మి కాంగ్రెస్ గూటికి చేరుతారా అనే అనుమానం కూడా ఉంది. వారందరిని ఇప్పుడు తనవైపు తిప్పుకోడానికి షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే కాంగ్రెస్ కొంత మేరకు బలోపేతం అవుతోంది.
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడం కోసమే తాను కాంగ్రెస్ చేరానని షర్మిల ప్రచారం చేస్తున్నారు. తన లక్ష్యం, తన తండ్రి లక్ష్యం కూడా రాహుల్ ను ప్రధానిని చేయడమేనంటూ విస్తృత ప్రచారం చేస్తూ ఆకట్టుకుంటోంది. అట్టడుగు స్థాయికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోయడానికి నాయకుల్లో మనోదయిర్యాన్ని నింపుతోంది. ఈ విదంగా ప్రచారం చేయడంతో వెళ్లిపోయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సొంత గూటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి వైసీపీ లో చేరిన వారంతా కూడా తిరిగి పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధం కావడంతో వైసీపీ శిభిరంలో ప్రకంపనలు మొదలైనాయి.
రాష్ట్రము విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ అంపశయ్యపైకి చేరుకొంది. అటువంటి పార్టీకి చికిత్స చేయడానికి షర్మిల ముందుకు వచ్చింది. పదేళ్ల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి బరిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో ఉనికిని చేరుకోడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈమేరకు ఫలించనుందో జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే.