Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు ఏదో తింటున్నామా? అన్నట్లు వ్యవహరిస్తున్నారు కానీ.. గతంలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా కొలిచేవారు. పూజ ఎంత నిష్టతో చేస్తామో ఆహారాన్ని కూడా అంతకన్నా నిష్టగా భుజించాలనే విషయం పురాణాల్లో సైతం లిఖించి ఉంటుంది. ఇంత పవిత్రమైన భోజనాన్ని ఈ ఐదుగురితో కలిసి తింటే అపవిత్రంగా మారుతుందట. శరీరాన్ని నిలబెట్టడంలో సరైన ఫలితాలను ఇవ్వదట. వారెవరో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం.. భోజనం సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. సంతోషంగా భుజించాలి. అబద్ధం చెప్పే వ్యక్తులతో కలిసి ఎప్పుడూ భోజనం చేయవద్దు. ఎందుకంటే వారు విషపూరితమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరికి నైతికత అన్న మాటకు అర్థం తెలియదు కాబట్టి అబద్దాలు చెప్పే వారితో భోజనం చేయద్దు.
వ్యాధి గ్రస్తులతో కలిసి భోజనం చేయవద్దు. అనారోగ్యంతో బాధపడే వారి శరీరంలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది. వారితో కలిసి భోజనం చేయడం వల్ల ఆ ప్రభావం ఆరోగ్యంగా ఉన్నవారిపై పడుతుంది. కనుక వ్యాధిగ్రస్తులతో కలిసి కూర్చుని భోజనం చేయరాదు.
నేర ప్రవృత్తి ఉన్నవారితో కలిసి ఆహారం తినద్దు. ఎందుకంటే వారి ఆలోచనల్లో ప్రతికూలత ఉన్నవారితో భోజనం చేయద్దు. వీరు ఉన్న ప్రదేశంలో నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి. కనుక నేర ప్రవృత్తి ఉన్నవారితో కలిసి కూర్చొని భోజనం చేయవద్దు.
నాస్తికులతో కలిసి కూడా భోజనం చేయద్దు. దేవుడిపై నమ్మకం లేని వ్యక్తులతో కలిసి భుజించడం వల్ల ఆ ప్రభావం మీ మనసుపై పడుతుంది. ఆపదలు చుట్టుముడతాయి. గరుడ పురాణం ప్రకారం.. భోజనం నాస్తికుడితో కలిపి చేయరాదు.
భోజనం సమయంలో ప్రశాంత చిత్తంతో ఉండేవారితో కలిసి భోజనం చేస్తే మేలు మేలు జరుగుతుంది.