Drink Water While Eating : మనం ఆహారం తినే ముందు నీళ్లు తాగడం మంచిది కాదు. తినేటప్పుడు నీరు తాగితే మనం తిన్న ఆహారం జీర్ణం కాదు. దీంతో అజీర్తి సమస్య వస్తుంది. అనేక రకాల సమస్యలు వస్తాయి. తినే సమయంలో నీళ్లు తాగకూడదు. తిన్న తరువాత గంటన్నర ఆగి నీళ్లు తాగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. లేకపోతే త్వరగా జీర్ణం కాకుండా పోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
పండ్లు తిన్నా వెంటనే నీళ్లు తాగకూడదు. పండ్లలో చక్కెర, ఈస్ట్ ఎక్కువగా ఉంటాయి. నీళ్లు తాగడం వల్ల జీర్ణం కాదు. కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది. నీళ్లు తాగితే ఆ యాసిడ్ కరిగి పండు సరిగా జీర్ణం అవ్వదు. అసౌకర్యంగా అనిపిస్తుంది. పుచ్చకాయ, దోసకాయ, నారింజ లాంటి పండ్లలో కూడా నీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న తరువాత నీళ్లు తాగితే డయేరియా వస్తుందని అంటారు.
ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. కనీసం గంట విరామం ఇచ్చి నీళ్లు తాగడం శ్రేయస్కరం. వేరుశనగ, నువ్వులు తిన్న వెంటనే కూడా నీళ్లు తాగడం సురక్షితం కాదు. చెరుకు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. ఇందులో పొటాషియం, కాల్సియం ఎక్కువగా ఉండటం వల్ల సమస్య వస్తుంది. నీళ్లు తాగే విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది.
ఈనేపథ్యంలో నీళ్లు తాగే సమయం కూడా చూసుకోవాలి. లేకపోతే కష్టాలు తప్పవు. అనారోగ్య సమస్యలు రావడం గ్యారంటీ. అందుకే తినే సమయంలో నీళ్లు తాగకూడదు. ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం నడుచుకుంటే రోగాలు రాకుండా ఉంటాయి. దీనికి అందరు శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ఇష్టమొచ్చిన రీతిలో నీళ్లు తాగడం మంచి అలవాటు కాదు.