TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన 5 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీలో చేరిన వారికి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారితో సమావేశం నిర్వహించిన భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా తన విజయానికి కృషి చేయాలని కోరారు. ఇంటింటికీ వెళ్లి సూపర్-6 పథకాల ను వివరించాలని, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Breaking News