Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు. విద్యార్థులకు పరీక్షలు పూర్తవుతాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈలోపు కొందరు ఏదయిన చూడదగిన ప్రదేశానికి వెళుదామని నిర్ణయం తీసుకుంటారు. లేదంటే పుణ్య క్షేత్రాలకు వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. మరి కొందరు పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత ప్రశాంతంగా వెళ్లవచ్చని నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ప్రతి వేసవి కాలంలో పలు కుటుంబాలు ఎదో ఒక చూడదగిన ప్రదేశానికి వెళుతారు. అందుకోసం ఏ ప్రాంతం చూడాలి. ఇప్పటి వరకు చూడని ప్రదేశము ఏమి ఉంది. గొప్పనైన ప్రాంతం ఎక్కడ ఉంది. చూడదగిన ప్రాంతం కోసం వెబ్ సైట్ లో వెతుకులాట మొదలవుతుంది.
ఇటీవల చాల మంది అయోధ్య ను చూడటానికి వెళుతున్నారు. బాల రాముడి విగ్రహం ప్రతిష్టాపన చేయడంతో ప్రజలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అయోధ్య తరువాత నంది హిల్స్, లక్ష ద్విప్ లను కూడా చూడటానికి తరలివెళుతున్నారు. అయోధ్య, లక్ష ద్విప్, నంది హిల్స్ దేశంలో చూడదగిన ప్రదేశాల్లో ప్రతమ స్థానంలో నిలిచాయని ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మై ట్రిప్ ప్రకటించింది.
ఎక్కువగా పురుషులు కలిసి గోవా వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. గడిచిన రెండు నెలల్లో గోవా టూర్ వెళ్లిన వారు అధికంగా ఉన్నారని ట్రిప్ సంస్థ తెలిపింది. దేవస్థానాల దర్శనం కోసం వెళుతున్న ప్రాంతాల్లో పూరి, వారణాసి కూడా నమోదు కావడం విశేషం.
కొందరికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటది. విదేశాలకు కూడా ఓడ ప్రయాణం చేయాలనే కోరిక ఉంటది. మరికొందరికి దగ్గరి దేశాలను చూడటానికి విమాన ప్రయాణం చేయాలనే కోరిక ఉంటది. కోరిక ప్రకారం ఓడ లేదా విమాన ప్రయాణం చేసి సరదాగా గడపాలని పలు కుటుంబాలు నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో అల్మాటీ బాకు, నగోయా ప్రాంతాలను చూడటానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది. వాటితోపాటు లక్సెంబర్గ్, లంకావీ, ఆంటాల్యా ప్రదేశాలు కూడా చూడదగినవి ఉన్నవి.
గత సంవత్సరం ఎండాకాలంతో పోల్చుకుంటే కుటుంబ పరంగా ప్రయాణం చేసినవారు 20 శాతం పెరిగారు. సోలో ట్రావెల్ సంస్థ 10 శాతం అభివృద్ధి చెందిందని ప్రకటించింది.