Telangana Ooty : మనదేశంలో చల్లని ప్రదేశాలు ఊటీ, కొడైకెనాల్ వెంటనే గుర్తుకు వస్తాయి. మన రాష్ట్రంలో చల్లని ప్రదేశం ఉంది తెలుసా? హైదరాబాద్ కు కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉండే మెదక్ జిల్లాలోని గొట్టంగుట్ట చల్లని ప్రదేశానికి ప్రతీకగా. ఇక్కడకు వెళ్తే కూడా మనకు ఊటీ వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. అదే చల్లని ప్రదేశం, జలపాతాలు, జాలువారే జలం, మైదానాలు, కొండలు మనకు మనసును ఉల్లాసపరుస్తాయి.
గొట్టంగుట్ట తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఇక్కడకు చేరుకోవడానికి అడవుల నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. జహీరాబాద్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం చూస్తే మనసు ఉల్లాసంగా మారుతుంది. చుట్టు మైదానాలు మధ్యలో మట్టి రోడ్డు మరోప్రపంచం పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొండల మధ్య ప్రవహించే జలపాతాలు చూస్తే హాయిగా ఉంటుంది.
ఈ ప్రాంతం పర్యాటకంగా కూడా ఎంతో బాగుంటుంది. చుట్టు అడవి మధ్యలో దేవాలయాలు కనిపిస్తాయి. చిన్న చిన్న దేవాలయాలు, శివాలయం, విఘ్నేశ్వరాలయం, భవాని మాత ఆలయం ఇలా మనకు ఆధ్యాత్మిక శోభను కలిగిస్తాయి. శ్రావణమాసం ప్రతి శ్రావణమాసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీన్ని రెండే శ్రీశైలంగా పిలుస్తుంటారు.
పది కిలోమీటర్లు వెళ్తే మల్కాపూర్ జలపాతం కనిపిస్తుంది. ఇది పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రతి శని, ఆదివారాలు ఎక్కువ మంది ఇక్కడకు వస్తుంటారు. గొల్లంగుట్ట కూడా మంచి పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. సినిమా షూటింగులు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ప్రజల భాష కూడా వేరుగా ఉంటుంది.
గొట్టంగుట్టకు వెళ్లాలంటే జహీరాబాద్ నుంచి పోవాలి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణించాలి. గొల్లంగుట్ట వెళ్లడానికి సౌకర్యం లేదు. జహీరాబాద్ నుంచే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.