Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. రోడ్డు ప్రక్కన వ్యాపారం చేసే సనావుల్లా(24) వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి సెల్ ఫోన్ ఇవ్వాలని అడిగారు. ఆయన మొబైల్ ను ఇవ్వడానికి నిరాకరించడంతో లాక్కునేందుకు ప్రయత్నించారు. సనాపుల్లా వారిని ప్రతిఘటించడంతో ఆయన ఛాతీపై కత్తితో పొడిచి మొబైల్ ను ఎత్తుకొని బైక్ పై పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి సనాపుల్లా మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను సేకరించి వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.