Salaar 2 : బాహుబలి తర్వాత దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ తో హిట్ అందుకున్నాడు డార్లింగ్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ఇది రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. మొదటి పార్ట్ ‘సలార్: కేస్ ఫైర్’ సంచలన విజయం సాధించడంతో.. ‘సలార్ 2’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రూ. 700 కోట్ల వరకు వసూలు చేసింది. విడుదలైన అన్ని భాషల్లో సలార్ భారీ విజయం దక్కించుకుంది.
దీంతో సలార్ 2 కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇది మరింత యాక్షన్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ ఫిలిమ్ సర్కిల్ లో చెక్కర్లు కొడుతోంది. సలార్ సినిమాలో శ్రుతిహాసన్ తో పాటు మరో హీరోయిన్ నటిస్తుందని తెలుస్తోంది.
సలార్ లో మరో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది. సలార్ 2కు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో కియారా అద్వానీ కనిపిస్తుందని టాక్. దీనిపై మేకర్స్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్2తో పాటు కల్కి, రాజా సాబ్ చేస్తున్నారు. ఇటీవలే కల్కి షూటింగ్ పూర్తయ్యింది. మేలో రిలీజ్ చేయనున్నరు.
View this post on Instagram