Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో ఎవరు చెప్పలేరు. అప్పటి దాకా తెరమరుగున్న ఉన్న రాత్రికి రాత్రికే స్టార్ గా అవతరించవచ్చు. అప్పటి వరకు తెర మీదుగా స్టార్లుగా వెలుగుతున్న వారు కనుమరుగు కావచ్చు. అదీ రంగుల ప్రపంచం సినిమా రంగం. సినిమా పూర్తయి రిలీజ్ డే రోజున షోలు ఆగిపోయిన సందర్భాలు తెలుగులో అనేకం. ప్రస్తుతం ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
పవన్ కల్యాన్ టాలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరో. పవర్ స్టార్ తో ఒక్క సీన్ లో కనిపించినా చాలు అనుకునే స్టార్ హీరోయిన్లు ఉన్నారు. అదీ పవర్ స్టార్ క్రేజ్. ఇక ఫుల్ లెంగ్త్ రోల్ వస్తే హీరోయిన్లకు పండగే. మంచి రెమ్యూనరేషన్ తో పాటు పేరు కూడా వస్తుంది. అయితే అ అవకాశం వచ్చి ఉసూరుమంటోంది టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్. నాగచైతన్య సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. అఖిల్ తోనూ సినిమా చేసినా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడిందీ లేదు. ఆమెకు పూరీ జగన్నాథ్ మాత్రం సక్సెస్ రుచి చూపించాడు. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా నిధికి మాత్రం మంచి పేరొచ్చింది. ఆ ఆ మూవీలో ఎక్కడా వల్గారిటీ లేకుండా గ్లామరస్ గా కనిపిచింది. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఆఫర్లు వచ్చాయి.
పవన్ తో సినిమా
ఇస్మార్ట్ శంకర్ ఆ తర్వాత పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు కు నిధికి ఆఫర్ వచ్చింది. ఆ మూవీ స్టార్ట్ అయ్యి మూడేళ్లు గడుస్తున్నా షూటింగ్ పూర్తి కాలేదు. ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో కూడా తెలియడం లేదు. ఒక దశలో సినిమా ఆగిపోయిందనే రూమర్లు వచ్చినా శ్రీరామ నవమికి మేకర్స్ చేసిన ప్రకటనతో సినిమా వస్తుందనే విషం స్పష్టమైంది.
రాజాసాబ్ తో లక్ మారేనా?
హరిహర వీరమల్లు తర్వాత మరో సినిమా లేని నిధికి ప్రభాస్ ఆఫర్ ఇచ్చాడు. మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ కు అవకాశం దక్కింది. నిధి అగర్వాల్ రాజా సాబ్ సెట్స్ లో అడుగుపెట్టిందని టాక్. ఈ మూవీ పై నిధి అగర్వాల్ బోలెడు ఆశలు పెట్టుకుంది. పవన్ సినిమా కెరీర్ తను డైలామాలో పడేసినా ప్రభాస్ సినిమాతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ పడుతుందని నిధి సన్నిహితులు చెబుతున్నారు.