AP New DGP : ఏపీ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే ఆయనను విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది.
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ ఆదివారం వేటు వేసిన నేపథ్యంలో నూతన డీజీపీని నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ), మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చూయగా ఈసీ హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది.