RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ బంతి బంతికి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు.. టీవీల్లో, ఫోన్లలో చూస్తున్న వారిని మునివేళ్లపై నిలబెట్టింది. ఒక బాల్ ఆర్సీబీ సైడ్, మరో బంతి చెన్నై వైపు మలుపులు తిరుగుతూ చివరి వరకు మ్యాచ్ కొనసాగింది. జడేజా, దోని చివరి వరకు పోరాటం చేయడంతో విజయం ఇరు జట్లతో దోబూచులాడి చివరకు ఆర్సీబీ వైపు మొగ్గింది.
బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఓపెనర్లు కొహ్లి, డుప్లెసిస్ మెరుపు బ్యాటింగ్ తో మొదటి వికెట్ కు 78 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ ఔటైన తర్వాత రజత్ పటిదార్, కెమెరూన్ గ్రీన్ ఇద్దరు సిక్సులు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రజత్ పటిదార్ 41 పరుగులు, కెమెరూన్ గ్రీన్ 38 పరుగులు చేయడమే కాకుండా ఇద్దరు కలిసి 7 సిక్సులు, 5 ఫోర్లు బాది చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో మొదటి ఇన్సింగ్స్ లో 218 పరుగులు చేయగలిగింది.
చెన్నై 201 పరుగులు చేసిన ప్లే ఆప్స్ కు చేరే దశలో 191 పరుగుల వద్దనే నిలిచిపోయింది. రచిన్ రవీంద్ర 67 పరుగులతోె రాణించిన రుత్ రాజ్ మొదటి బంతికే ఔట్ కావడం చెన్నైను దెబ్బతీసింది. డారెల్ మిచెల్, శివమ్ దూబె, రుతురాజ్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివర్లో రవీంద్ర జడేజా 22 బంతుల్లోనే 42 పరుగులు చేసి ఔరా ఆర్సీబీని భయపెట్టాడు. కానీ చివరి రెండు బంతుల్లో 10 పరుగులు కావాల్సిన దశలో యశ్ దయాల్ స్లో బాల్స్ తో మ్యాజిక్ చేసి ఆర్సీబీని గెలిపించాడు.
చివరి ఓవర్ లో ప్లే ఆప్స్ చేరాలంటే 17 రన్స్ కావాల్సిన దశలో మొదటి బంతికే 110 మీటర్ల భారీ సిక్సు బాదిన దోని నెక్ట్స్ బంతికి ఔటయ్యాడు. తర్వాత బాల్ కు శార్దూల్ డాట్ చేయగా.. నెక్ట్స్ బంతికి సింగిల్ తీశాడు. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో యశ్ దయాల్ డాట్ బాల్స్ తో ఆర్సీబీని గెలిపించాడు.