![Hardik-Natasa](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/natasha.JPG.jpg)
Hardik-Natasa : టీం ఇండియా క్రికెటర్ హర్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నడనే వార్త కలకలం రేపుతోంది. సెర్బియన్ నటి నటాషా స్టంకోవిచ్ ను నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగు సంవత్సరాలుగా వారు బాగానే కలిసి ఉన్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కథనం ప్రకారం.. హర్దిక్ పాండ్యా భార్య నటాషా తన ఇన్ స్టా గ్రాంలో పాండ్యా అనే ట్యాగ్ ను తీసేసినట్లు, అందులో పాండ్యాతో దిగిన ఫోటోలన్ని డిలేట్ చేసినట్లు వార్తను పబ్లిష్ చేసింది.
దీంతో టీం ఇండియా క్రికెటర్ హర్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం వైరల్ గా మారింది. వీరిద్దరూ ఇప్పటి వరకు విడాకులు తీసుకున్నారా.. లేక తీసుకోబోతున్నారా అనేది ఇంకా పూర్తిగా తెలియకున్నా.. త్వరలోనే వీరిద్దరూ విడిపోనున్నట్లు తెలుస్తోంది.
నటాషా విడాకులు తీసుకుని హర్దిక్ పాండ్యా నుంచి భరణం కింద దాదాపు 70 శాతం పాండ్యా ఆస్తిని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హర్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా తీసుకున్న తర్వాత వ్యక్తిగతంగా పర్పామెన్స్ చేయడంలో విఫలం కావడం, ఇటు పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు పడటం చూస్తుంటే తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా నటాషా చేసిన ఇన్ స్టా పోస్టు కూడా వైరల్ అవుతోంది. తాను డ్రైవింగ్ స్కూల్ లో లైసెన్సు కోసం వెళ్లినట్లు తెలిపే ఓ పిక్ ను పోస్టు చేసింది. అందులో త్వరలోనే రోడ్ పైకి రానున్నట్లు చెప్పింది. అయితే వీరిద్దరి విడాకుల వ్యవహారంపై ఇప్పటి వరకు నటాషా, పాండ్యా స్పందించలేదు. ఇన్ స్టా గ్రాంలో వారి నటాషా ఇద్దరి ఫొటోలు డిలేట్ చేయలేదని వారి విడాకుల వార్తలు కేవలం పుకార్లే అని కొంతమంది కొట్టి పారేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హర్దిక్ పాండ్యా అమెరికాలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ నకు సెలక్ట్ అయ్యాడు.