MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె వేసిన బెయిల్ పిటీషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత, ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయల్ పిటిషన్లు దాఖలు చేశారు.
ఇటీవల విచారణ సందర్భంగా కవితతో పాటు ఈడీ, సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్టు చేశారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ అరెస్టు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ కు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. అయితే, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలుగుతారని, ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని, సూత్రధారి, పాత్రధారి ఆమేనని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.