Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా అనుమతిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈరోజు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
అయితే, జూన్ 2న మళ్లీ కోర్టులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన 50 రోజుల తర్వాత బెయిల్ మంజూరు కావడంతో ఆప్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. సుప్రీం నిర్ణయం పట్ల ఢిల్లీ హర్షం వ్యక్తం చేశారు.