CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల, రేవంత్ రెడ్డిలపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కడప పార్లమెంట్ స్థానంలో తన చెల్లెలు షర్మిల పోటీ చేయడంపై నాకు బాదలేదు. కానీ ఆమె డిపాజిట్ కోల్పోతుందనే బాధ ఎక్కువగా ఉంది.
ఆమె చేస్తుంది కరెక్టు కాదని అన్నారు. అక్రమ కేసుల ఛార్జిషీట్ లలో నా తండ్రి, నా పేరును చేర్పించింది కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏపీలో నా చెల్లెలు షర్మిల, ఐఎన్ సీని సీఎం రేవంత్ రెడ్డి ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నడిపిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు.