AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ ఈరోజు జరిగింది. తనను సస్పెండ్ చేయడాన్ని అదనపు డీజీ వెంకటేశ్వరరావు క్యాట్లో సవాల్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వాదనలు వినిపించిన పిటిషనర్ న్యాయవాది ఆదినారాయణ. ఒకే కారణంతో వెంకటేశ్వరరావును రెండుసార్లు సస్పెండ్ చేశారని న్యాయవాది ట్రబ్యనల్ కు తెలిపారు. సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వాదించారు.
ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఛార్జ్షీట్పై వాదనలు ముగిసే వరకు సస్పెన్షన్ అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ తీర్పును వాయిదా వేసింది.