MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీం కోర్టు ఊరకనిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు బయలు మంజూరు చేసింది.
సంజయ్ సింగ్ పై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని సూచించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలిపింది. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం అర వింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జైలులో ఉన్నారు.
గత కొద్ది రోజుల నుంచి ఆప్ నేతలను లిక్కర్ స్కాం కేసు కలవర పెడుతుంది. ఇప్పటికే అరెస్టు అయిన వారికి బెయిల్ రావడం కష్టంగా మారుతుంది. అయితే ప్రస్తుతం ఆప్ యంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం తో ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.