Niharika Konidela : గత కొంతకాలంగా నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకుంటుందనే వార్త సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. ఇటీవల వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్లో నిహారిక తన భర్తతో కాకుండా ఒంటరిగా ఆ వేడుకకు హాజరయ్యారు. అప్పుడే విడాకులు కన్ఫామ్ అయినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక ఈ వార్తలను నిజం చేస్తూ నిహారిక నేడు తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు పెట్టింది. తన భర్త చైతన్యతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు నిహారిక స్పష్టం చేసింది. ఇది చాలా సున్నితమైన విషయమని.. తమను ఇబ్బంది పెట్టేలా ఎవరూ పోస్టు పెట్టవద్దని విజ్ఞప్తి చేసింది. వ్యక్తిగత జీవితంతో ప్రైవసీని గౌరవించాలని.. తామిద్దరం ప్రారంభించబోయే కొత్త జీవితాన్ని గౌరవించాలని కోరారు.
ఇంతకాలం తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు.. సన్నిహితులకు నిహారిక కృతజ్ఞతలు తెలిపారు. మీ సపోర్ట్ ఇలానే కొనసాగించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. కాగా 2020 ఏడాదిలో నిహారిక-చైతన్య వివాహం జరిగింది. పెళ్లాయిన కొద్ది నెలలకే వీరి మధ్య అభిప్రాయాలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా నిహారిక కొత్తగా ప్రారంభించే జీవితం సాఫీగా సాగాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.