Sobhan Babu-Jayalalitha : తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు నలుగురు స్టార్స్ మన టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా ఉన్నారు.. వారు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ.. ఈ నలుగురు తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు.. వీరందరూ కేసుల ఒకే తరం హీరోలు.. ఈ నలుగురు హీరోలు స్టార్ హీరోలుగా సినిమాల పరంగా పోటీ పడుతూ రాణించేవారు.
ఈ నలుగురు హీరోల్లో ముగ్గురు హీరోలు చివరి సమయంలో వేరే క్యారెక్టర్ లలో నటించారు.. కానీ శోభన్ బాబు మాత్రం ఎన్ని డబ్బులు ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించేందుకు నో చెప్పేవారట. నేను హీరో పేరుతోనే చనిపోవాలని అనుకున్నారు అదే విధంగా హీరోగానే వెళ్లి పోయారు.. ఇదంతా పక్కన పెడితే శోభన్ బాబు కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈయనను చాలా మంది హీరోయిన్స్ ఇష్టపడేవారట..
ఈయన మంచి అందగాడు కావడంతో హీరోయిన్స్ కు క్రష్ గా ఉండేవాడు. ఇక ఈయన పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ రాజకీయ నాయకురాలు జయలలితను ప్రేమించాడట.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్న అది కుదరలేదని అంటుంటారు. మరి ఈయన ఇష్టపడిన హీరోయిన్ ఎవరో కాదు జయలలిత.. వీరిద్దరూ లవ్ చేసుకున్నారు.
కానీ పెళ్లి చేసుకోలేక పోయారు.. దీంతో జయలలిత ఈయనను మర్చిపోలేక పెళ్లి కూడా చేసుకోలేదు. వీరి జంట ఎన్నో సినిమాల్లో నటించారు. వీరి కాంబోలో వచ్చిన డాక్టర్ బాబు సూపర్ హట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆమె తల్లి మరణిస్తే జయలలిత డిప్రెషన్ లోకి వెళ్లిపోగా ఈయన దగ్గరుండి చూసుకున్నారట.. అప్పుడే ప్రేమ చిగురించినట్టు శోభన్ బాబు తెలిపారు..
ఇక డాక్టర్ బాబు ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు జయలలిత గురించి శోభన్ బాబు తన డైరీలో కొన్ని అమూల్యమైన మాటలు పొందుపర్చుకునాన్రు. చాలా బరువైనటువంటి నా మనస్సును నీవే తేలిక చేసావు.. అందరితో మాట్లాడాలని కలిసి ఉండాలని నాకు అనిపిస్తున్నదని జయలలితో తనతో చెప్పినట్టు డైరీలో రాసుకొచ్చారు. అంతేకాదు తన తల్లి మరణాన్ని కూడా మర్చిపోయేలా చేసింది నువ్వే అని ఆమె చెప్పిందట.. నా అనుకున్న వారు మోసం చేసిన సమయంలోనే నీవే అండగా నిలిచావు అంటూ శోభన్ బాబుతో జయలలిత చెప్పగా ఈ విషయాలను ఆయన తన డైరీలో రాసుకున్నారు.