Home POLITICS ANDHRA PRADESH Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

26
Kranthi
Kranthi

Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. కేవలం తన తండ్రిని పవన్ కళ్యాణ్ ను తిట్టించడానికే సీఎం జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. పవన్ విజయం కోసం కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానంటూ ఇటీవల ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో క్రాంతి స్పందించారు. ‘‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైకాపా నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. పవన్ ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే  మానాన్న ఆయన పేరు పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటా నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ ప్రకటన ఆయన అభిమానులకూ నచ్చలేదు. ఈ విషయంలో మా నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా.. పవన్ గెలుపు కోసం నా వంతు కృషి చేస్తా’’ అని ముద్రగడ కుమార్తె వెల్లడించారు.