Vijaya Sankalpa Sabha : లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రానున్న 10 రోజుల్లో దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పలు బహిరంగ సభల్లో మాట్లాడతనున్నారు. అందులో భాగంగా తెలంగాణలో సోమ, మంగళవారాల్లో ఆయన అధికారిక కార్యక్రమాలతో పాటు రెండు బహిరంగ సభల్లోనూ పాల్గొంటారు. ఆదిలాబాద్ లో సోమవారం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం తర్వాత పార్టీ సభలో ప్రసంగిస్తారు.
కాగా, మంగళవారం (మార్చి 5)న మెదక్ లోక్ సభ పరిధిలోని సంగారెడ్డిలో అభివృద్ధి పనులను ప్రారంభించి పటాన్ చెరు, పటేల్ గూడ, ఎల్లంకి కాలేజ్ దగ్గర ఉదయం 9 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డా. సి. అంజిరెడ్డి, బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సి. గోదావరి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు.