Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ఈనెల 30న హస్తం పార్టీ కండువా కప్పు కుంటారని సమాచారం అందుతోంది.
కేశవరావుతోపాటు ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కాసేపటి క్రితమే కేశవరావు ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో కెసిఆర్ తో భేటీ అయ్యారు. పార్టీ మారేందుకు ఆయన అనుమతి తీసుకునేందుకు కేకే వెళ్లినట్లు తెలుస్తుంది.
మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీని విడిచి అధికా ర కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మరి కొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రణాళిక లు సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం తో పాటు ఈడీ కేసు టెన్షన్ మొదలైన నేపథ్యంలో ఆ పార్టీలో ఉండేందుకు నేతలు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.