Danam Nagender : లోక్ సభ ఎన్నికల వేళ దానం నాగేందర్ కు ఓ కొత్త సమస్య వచ్చింది. దానం నాగేందర్ పార్టీ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు ఆయన నామినేషన్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తాజాగా బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించి దానం నాగేందర్ సికింద్రాబాద్ నామినేషన్ ను రిజెక్ట్ చేయాలని, తనను ఎమ్మెల్యే పదవి సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషన్ కు మెయిల్ లో ఫిర్యాదు చేసింది.
దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలంటూ వారికి అందుబాటులో ఉన్న అన్ని న్యాయ మార్గాలను బీఆర్ఎస్ వెతుకుతోంది. ఈ విషయంలో బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా స్పీకర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో, బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంంలో ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించి తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.