CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత తనదే అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం దానం నాగేందర్ తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో పీఎం నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఉన్న మోదీ, రాష్ట్రంలో ఉన్న కేడీ ఇద్దరూ తెలంగాణకు ఏం చేయలేదంటూ ఆరోపించారు.
జంట నగరాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. యూనివర్సిటీ భూములను కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నారని, వారందరి పని దానం నాగేందర్ చూస్తాడని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపామని, పార్టీ కోసం కష్టపడ్డ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఎమ్మెల్సీని చేశామని గుర్తు చేశారు.