Telangana : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణ సంఘటన జరిగింది. 5000 అప్పుకు మూడు నెలలుగా వడ్డీ చెల్లించలేదనే కారణంతో మేతరి రవి అనే వడ్డీ వ్యాపారి బాలయ్య అనే యువకుడిని చితకబాదాడు.
అతనిపై పిడుగులు కురిపిస్తూ కాలితో తన్నాడు. ఈ దృశ్యాన్ని కొడుకుతో వీడియో తీయించి రాక్షస ఆనందం పొందాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
తీసుకున్నందుకు వడ్డీ చెల్లించలేదన్న కారణం చేత అమాయకుడైన ఓ వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు కొట్టా డు. అయితే తాను కొడుతున్నప్పుడు వీడియో కూడా తీయాలని తన కొడుకు చెప్పి మరి వీడియో తీస్తుండగానే అతనిపై దాడి చేశారు.
బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేసిన వీడియో కూడా వాళ్ళ దగ్గర ఉందని బాధితుడు ఫిర్యాదు ఇచ్చాడు. నేపథ్యంలోని పోలీసులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.