YS Vijayamma : కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పులివెందుల అసెంబ్లీ స్థానానికి సీఎం జగన్ పోటీలో ఉండగా, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో నిలిచారు. వీరిద్దరిలో విజయమ్మ మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై చర్చ జరుగుతుంది.
ఆమె ఎవరికి తరఫునైనా ప్రచారం చేస్తారా..? లేదా సైలెంట్ గా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారిం ది. గత ఎన్నికల్లో కలిసి పనిచేసిన అన్నా చెల్లెలు ఈసారి వేరువేరు పార్టీల తరఫున బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద కడప రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఒకవైపు కొడుకు, మరోవైపు కూతురు పోటీ చేయడం విజయమ్మకు తలనొప్పిగా మారిందనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎవరికి మ ద్దతు ఇచ్చిన ఇంట్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి విజయమ్మ ఎవరికి మద్దతు తెలుపకుండా తటస్థంగా ఉంటారా లేదా షర్మిలకు మద్దతి స్తారా అన్నది తెలియాల్సి ఉంది.