PBKS Vs MI : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, ముంబయి ఇండియన్స్ మధ్య ముల్హన్ పూర్ లో గురువారం సాయంత్రం హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ , పంజాబ్ ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో రెండు మాత్రమే గెలిచి నాలుగింట ఓడిపోయాయి. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ముంబయి ఇండియన్స్ లో సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు సూర్య ఆడిన మూడు మ్యాచ్ ల్లో కేవలం ఒక్క హాప్ సెంచరీ మినహా రెండింట్లో విఫలమయ్యాడు.
ముల్హన్ పూర్ పిచ్ సెకండ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన వారు కచ్చితంగా చేజింగ్ కే ప్రాధాన్యమిస్తారు. డ్యూ ఎఫెక్ట్ ఉండడం వల్ల బౌలర్లకు ఇబ్బంది గా మారి బ్యాట్స్ మెన్ ఈజీగా బ్యాటింగ్ చేయొచ్చు. పంజాబ్ కింగ్స్ కు గాయం వల్ల దూరమైన శిఖర్ దావన్ ఈ మ్యాచ్ లో కూడా ఆడకపోవచ్చు. శిఖర్ లేని లోటును పూడ్చడం పంజాబ్ కు కష్టమైనా.. గత మ్యాచ్ లో లో స్కోరింగ్ మ్యాచ్ ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లి పోరాడారు.
పంజాబ్ కు సామ్ కర్రన్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ బ్యాటర్లు రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ విభాగంలో పర్వాలేదనిపించినా.. బ్యాటింగ్ లో తడబడుతున్నారు. హర్షదీప్ పైనే బౌలింగ్ భారం పడనుంది.
ముంబయి ఇండియన్స్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లో విఫలమవుతున్నారు. హర్దిక్ పాండ్యా బౌలింగ్ లో తేలిపోతున్నాడు. స్పిన్ విభాగంలో ఈ సారి పెయిల్యూర్ కనిపిస్తుంది. ముంబయి ఈ మ్యాచ్ గెలవకపోతే ఫ్లే ఆప్ రేసు సంక్లిష్టం అవుతుంది. అసలే అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న ఈ టీం రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం అనేది అతడి ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ లో ఫామ్ లోకి వచ్చినా మిగతా వారు ఇంకా రావాల్సి ఉంది. పాయింట్స్ టేబుల్స్ లో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్న పంజాబ్, ముంబయి ఈ మ్యాచ్ గెలిచే వారికి ప్లే ఆప్ అవకాశాలు మెరుగుపడతాయి. లేదంటే చివరి ఏడు మ్యాచ్ ల్లో కచ్చితంగా ఏడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.