తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్, దాసరి రమణ స్ట్రీట్,ఇందిర స్ట్రీట్ మరియు సి.యస్.ఐ చర్చ్ ప్రాంతాలలో గడప గడపకి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ వారిని పార్టీకి మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యలు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్,గణేష్ నగర్ ప్రాంతాలలో దేవినేని సుధీర,14వ డివిజన్,చిన్నవంతెన,చరిత శ్రీ రోడ్ ప్రాంతాలలో వై.సిద్దార్థ లు గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్లలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే కొండప్రాతంలో అభివృద్ధి జరిగింది అని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ప్రజలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు నాయుడు కుటుంబాల్లో చీలిక తెచ్చి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ తో చీకటి ఒప్పందాలు చేసుకొని షర్మిల ను అధ్యక్షురాలుగా చేసి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని దించాలి అనే కుట్రలు ప్రజలు అందరూ గమనిస్తున్నారని మీరెన్ని జెండాలు కట్టుకొని వచ్చిన గెలవడం జరగని పని అని అన్నారు.ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య మరియు వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.