నారాయణపేట జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జక్లేర్ లో రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రెండు కార్ల లో ఒకటి కర్ణాటక, మరొకటి మహారాష్ట్రకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Breaking News