Govinda Raja Swamy : తిరుపతి గోవింద రాజస్వామి వారి రథం అగ్నికి అహుతి అయ్యిందన్న వార్తపై టీటీడీ స్పందించింది. టీటీడీ చెప్పిన వివరాల ప్రకారం.. ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయిందని పేర్కొంది. అంతే తప్ప గోవిందరాజు స్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.
Breaking News