Sajjala Bhargav : ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో, అధికార, విపక్ష నేతలు పోటాపోటీగా ఈసీకి పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నేత వార్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించిన ఈసీ భార్గవ్పై కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించింది. భార్గవ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా టీమ్ నిందితులుగా ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు పింఛన్లు నిలిపివేశారని వైసీపీ టీమ్ ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రచారం చేసిందని టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ క్రమంలో సజ్జల భార్గవరెడ్డిపై పలు సెక్ష్లన్లపై కేసు నమోదు చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై కేసులు పెట్టించడంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. కానీ తాము అంత కంటే ఘోరం చేస్తున్నా.. తమను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నారు. కానీ ఈసీ అధికారులు తప్పుడు ప్రచారంపైనా కేసులు పెట్టాలని సీఐడీని ఆదేశించారు. నాలుగైదు రోజులు నసిగిన సీఐడీ అధికారులు.. చివరికి తప్పని పరిస్థితుల్లో కేసులు నమోదు చేయక తప్పలేదు.
పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఇంటలిజెన్స్ ను కూడా వాడుకుంటూ ఏకంగా ఓ ఫేక్ వ్యవస్థనే సృష్టించారు. ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు వార్తలతో వడ్డి వారించారు. ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అర్థరాత్రి వారి ఇళ్లపైకి పోలీసులను దాడులు చేసేందుకు పంపేవారు. ఇప్పుడు వారు అధికారంలో ఉండగానే సీఐడీ కేసులు పెట్టేసింది.