ఏపీలో ఇప్పుడు పొత్తుల రాజకీయ నడుస్తుంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఇప్పటి నుంచి ఎన్నికల వ్యూహాలపై అలర్ట్ అయ్యాయి.. ఎవరి స్థాయిలో వారు గెలుపు పై లెక్కలు వేసుకుంటున్నారు.. మరోవైపు ఏపీలో పొత్తులపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు ఉండడంతోనే బాబు ఆ మాట చెప్పారనే ప్రచారం ఉంది.. చంద్రబాబు నాయుడి కామెంట్లపై బీజేపీ నేతలు స్పందించలేదు..దీంతో బీజేపీ కూడా పొత్తుకు సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఇలాంటి సమయంలో ఆ పార్టీ ఎంపీ.. చంద్రబాబు నాయుడు కి విదేయుడిగా గుర్తింపు ఉన్న సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తదుపరి ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్లో వచ్చేది బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. పొత్తుకు బీజేపీ సిద్ధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చేది బీజేపీ, జనసేన భాగస్వామ్య ప్రభుత్వమా..లేక బీజేపీ, జనసేన, టీడీపీ మిత్రపక్షాల ప్రభుత్వమా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు..అయితే బీజేపీ దశల వారిగా ఉద్యమించాలని సిద్ధమైంది.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రాష్ట్ర సర్కార్పై ఛార్జిషీట్లు వేయడం ఆ కార్యచరణలో మొదటి దశ. ఇందుకోసం పార్టీలోని 11 మంది సీనియర్లతో కమిటీ వేశారు కూడా. అయితే ఛార్జిషీట్లలో ఏఏ అంశాలు పొందుపర్చాలో నిర్ణయించేందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్లతో కమిటీ ఏర్పాటైంది. ప్లానింగ్ కమిటీ బాధ్యతలు సుజనాచౌదరికి అప్పగించారు.