CM Revanth : ఏపి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రేపు విశా ఖపట్నంలో జరగనున్న న్యాయసాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ కూడా ప్రకటించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేవంత్ సీఎం అ య్యాక ఏపీకి వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజుల నుంచి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో నే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వారికి మద్దతు ప్రకటించారు. వారికి అనుకూలంగా జాతీయ కాంగ్రెస్ నేతలతో ఆమె భారీ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.