Lakshminarayana : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై సిబిఐ మాజీ జేడీ, జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనా రాయణ తెలిపారు. విశాఖ ఉత్తరం సీటు నుం చి బరిలోకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు.
రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయo కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసామని లక్ష్మీనారా యణ తెలిపారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల స్థానిక పరిపాలన పోయిందని ఆయన విమ ర్శించారు. చట్టాల రూప కల్పనలో ప్రజల అభిప్రా యం తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
ఏ చట్టం రూపొందించిన ప్రజల ఆమోదం తప్ప నిసరి అని మాజీ జెడి లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదని అభివృద్ధి జరగాలంటే జై భారత్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన తెలిపారు.