Medaram Jatara : తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సమ్మక్క-సారక్క జాతర అత్యంత ముఖ్యమైనది. లక్షలాది మంది భక్తులు జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. దీంతో కొన్ని కోట్ల మంది భక్తులు మేడారం సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటారు. వారికి మొక్కులు చెల్లించుకుంటారు. దీతో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తుంటారు. ఊళ్లలో కూడా భక్తులు బారులు తీరి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.
రెండేళ్లకోసారి ఫిబ్రవరి నెలలో సమ్మక్క-సారక్క జాతర వస్తుంది. ఆ మూడు రోజులు బ్రహ్మాండంగా భక్తులు జంతువులను బలి ఇచ్చి సంతోషంగా గడుపుతారు. సమ్మక్క జాతర అంటేనే విందులు, వినోదాలు. సమ్మక్క జాతర ఈ సారి ఫిబ్రవరి 21న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పునుగొడ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవింద రాజులు గద్దెపైకి వస్తారు.
ఫిబ్రవరి 22న చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఫిబ్రవరి 23న సారక్క గద్దెపైకి వస్తుంది. ఫిబ్రవరి 24న దేవతల వన ప్రవేశం, ఫిబ్రవరి 28న తిరుగువారం జాతర జరుపుకునేందుకు నిర్ణయించారు. ఇలా సమ్మక్క, సారక్క జాతర మూడు రోజుల పాటు సందడి చేయనుంది. ప్రతి గ్రామంలో భక్తులు పూనకాలతో ఊరేగుతారు.
తమ మొక్కులు చెల్లించుకుంటారు. చల్లంగా చూడు తల్లులారా అంటూ వేడుకుంటారు. తాము కోరుకున్న కోరికలు తీరిస్తే వచ్చే జాతరకు ఏటను కోస్తామని మొక్కుకుంటారు. వారు మొక్కిన మొక్కులు తీరితే తల్లులకు తమ ఇష్టానుసారం మొక్కులు చెల్లిస్తారు. సమ్మక్క, సారక్క జాతర మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పేరుగల జాతరగా పేరుగాంచింది.