KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విశాఖపట్నం లోక్ సభ పరిధిలోని శృంగవరపుకోట నియోజకవర్గంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో తాను గెలవకపోతే మరే ఎన్నికల్లోనూ పోటీచేయనని తెలిపారు. గెలిచిన వంద రోజుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత విశాఖ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న తాటిముంజలు అమ్మే వ్యాపారి వద్దకు వెళ్లి తాటిముంజలు కొట్టారు. రెండు రోజుల క్రితం విశాఖలో మత్స్యకారులను కలిసిన కేఏ పాల్ మత్స్యకారుడి వేషంలో వారితో కలిసి చేపలు పట్టారు.