AP Elections 2024 : రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగ్ లు,కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు డెడ్ లేని విధించారు.
సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో ప్రచార హోర్డింగ్ లు కటౌట్ల ను తొలగించాలని ఆదేశించారు. షెడ్యూల్ విడుదల కావడంతో నిన్నటి నుంచే రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చిందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఎన్నికల నియమావళిని అధికారులు అందరూ తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని ప్రతి ఒక్కరిని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు వారి సిబ్బందికి ఎన్నికల నియమాలపై అవగాహన కల్పించాలన్నారు.