Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. వైసీపీ ప్రకటించింది నవ రత్నాలు కాదు.. నవ మోసాలని చంద్రబాబు విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలతో ఎన్డీయే కూటమి ముందుకొస్తున్నట్లు తెలిపారు.
‘‘రాష్గ్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. దళిత, గిరిజన ద్రోహి.. జగన్, ఓటేసిన వారిని కాటేసే రకం ఆయనది. ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ ను దోచుకున్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు అన్నింటి ధరలను పెంచేశారు. ఉద్యోగాల్లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. జగన్ మీ బిడ్డ కాదు. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. ఉద్యోగాలు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.