Telangana : అకాల వర్షాలు, వడగళ్లతో పంటను నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంట నష్టం అంచనా వేయాలని వ్యవసాయశాఖను ఆదేశించారు.
మరో రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడం వల్ల ఆ తర్వాత పంట నష్టం పై అంచనా వేయడానికి ప్రభుత్వ అధికారులు సిద్ధమవుతున్నారు.
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతితో రైతులకు నష్టపరి హారం అందించేందుకు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. దాదాపుగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.