Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన నాగసాయి మనస్వీ 600 మార్కులకు 599 మార్కలతో ప్రశంసలు అందుకోగా.. తాజాగా కర్జాటకలో ఓ అమ్మాయి ఏకంగా 625 మార్కులకు 625 సాధించి అదరహో అనిపించింది. బాగల్ కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్ఎస్ఎల్సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరు శాతవ మార్కులతో అదరగొట్టారు. ఆమె తండ్రి బసప్ప రైతు కాగా. . తల్లి గృహిణి.
ముధోల్ తాలూకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలో చదువుతున్న బాలిక అంకిత.. ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె సాధించిన అపూర్వ విజయం గురించి టీచర్లు చెప్పగానే స్వగ్రామం వజ్జరమట్టిలో ప్రజలంతా వారి ఇంటికి చేరుకొని బాలికను అభినందించారు. గ్రామస్థులు సంబరాలు చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు.