Pothina Mahesh : జనసేన నేత పోతిన మహేష్ కు సీటు ఇవ్వకపో వడంతో పవన్ తీరుపై జనసేన శ్రేణులు మండి పడుతున్నారు. పవన్ తమను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోతినకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కా ర్యాలయం వద్ద వారు శుక్రవారం ఆందోళనకు దిగారు.
అనంతరం మహేష్ కు టికెట్ కేటాయించక పోవడం పట్ల జనసేన వీర మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. ఎన్ని రోజులు జనసేన పార్టీ కోసం కష్టపడి చేస్తే ఇప్పుడు టిక్కెట్ ఇంకొకరికి ఇవ్వడం ఏంటని వారు మండిపడుతున్నారు.
జనసేన పార్టీ కోసం పోతిన మహేష్ నేతృత్వం లో అనేక నిరసన కార్యక్రమాలు చేశామని తెలియ జేశారు. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ జనసేన గొంతును వినిపించామని ఇంత కష్టపడిన నాయకుడికే కాదని వేరే వాళ్లకు టికెట్ ఇస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరిక జారీ చేస్తున్నారు.