TTD Bus Theft :
దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. మనకు ఏదైనా నష్టం జరిగితే దేవుడిని ప్రార్థిస్తాం. కానీ దేవుడి ఆస్తులే అపహరణకు గురైతే ఇక ఎవరికి చెప్పుకోవాలి. గోవిందా.. గోవిందా అంటూ ఉండిపోవాల్సిందేనా? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు కొండపైకి మళ్లీ అక్కడి నుంచి కిందకు తరలించేందుకు పది ఎలక్ర్టికల్ బస్సులను ఏర్పాటు చేసింది.
ఇవి రోజు భక్తులను చేరవేస్తూ సేవలు అందిస్తుంటాయి. పగలు సేవలందిస్తూ రాత్రి పూట స్థానిక స్వామి వారి రవాణా కార్యాలయం వద్ద నిలుపుతుంటారు. అక్కడే చార్జింగ్ పెడతారు. కానీ నిన్న రాత్రి 3.53 గంటల సమయంలో బస్సును దొంగిలించారు. ఉదయం రవాణా శాఖ అధికారులు గుర్తించి క్రైమ్ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వారు వచ్చి సీసీ కెమెరాలు, జీపీఎస్ ద్వారా బస్సు నాయుడుపేట బిరుదవాడకు సమీపంలో టిడ్కో ఇళ్ల వద్ద రహదారిపై వదిలి వెళ్లినట్లు గుర్తించారు.
పోలీసులు వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. తిరిగి కార్యాలయం వద్దకు చేర్చారు. రవాణా శాఖ కార్యాలయం వద్ద తగిన భద్రత సిబ్బంది లేకపోవడంతోనే బస్సును సులభంగా చోరీ చేశారనే వాదనలు వస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే బస్సు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. వారం కిందట టీటీడీ కి చెందిన ఓ ఎలక్ర్టిక్ కారున చోరీ చేసినట్లు తెలిసింది.
కడప సమీపంలోని ఒంటిమిట్ల ఆలయం వద్ద వాహనాన్ని స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో అధికారులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు పోలీసులు దీనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఇలా దేవుడి ఆస్తులకు విలువ లేకుండా పోవడం చూస్తుంటే ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి.
ReplyForward
|