Navneet Kaur : హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్ధతుగా బీజేపీ అమరావతి లోక్ సభ అభ్యర్థి నవనీత్ కౌర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె 202లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ‘‘15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ ఆనాడు అన్నారు. కానీ వాళ్లకు 15 నిమిషాలేమో.. మాకు 15 సెకన్లు చాలు’’ అని నవనీత్ కౌర్ సవాల్ విసిరారు. 2019లో అమరావతి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నవనీత్ ప్రస్తుతం బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనికి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఆమెకు గంట సమయం ఇవ్వాలని తాము ప్రధాని మోదీని కోరుతాం. మోదీజీ మీకు అధికారం ఉంది.మేం కూడా మానవత్వం ఎంత మిగిలి ఉందే లేదో చూస్తాం. మేం భయపడం. మిమ్మల్ని ఎవరు ఆపుతారు..? ప్రధాని మీ వ్యక్తి. ఆర్ఎస్ఎస్ మీది. ప్రతీదీ మీదే. చెప్పండి ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాం’’ అని అన్నారు.