CSK Vs PBSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. సీఎస్కే తన చివరి మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్ను ఇదే మైదానంలో ఓడించింది. జట్టు తరఫున కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులు చేయగా, తుషార్ దేశ్పాండే బౌలింగ్లో విధ్వంసం సృష్టించాడు.
పంజాబ్ జట్టు సీఎస్కేతో చెపాక్లో తలపడనుంది. ఇక్కడి పిచ్ బౌలర్లకు బాగా ఉపయోగపడుతుంది. గత మ్యాచ్లో సన్రైజర్స్పై ఆతిథ్య జట్టు 78 పరుగుల తేడాతో సులువుగా విజయం సాధించింది. మంచు లేకుంటే సన్రైజర్స్పై చూసినట్లుగా రెండో ఇన్నింగ్స్లో పరుగులు చేయడం కష్టమవుతుంది. చెపాక్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ చేయాలని కోరుకుంటుంది, కానీ మంచు లేనప్పుడు మాత్రం ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది.
సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో, ఈ పిచ్పై సీఎస్కే 200 కంటే ఎక్కువ పరుగులు చేసింది. ఆ తర్వాత అద్భుత బౌలింగ్తో సన్రైజర్స్ను చిత్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్కు చెపాక్లో ఆడడం అంత ఈజీ కాదు. తాజాగా టీ20 క్రికెట్లో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. పంజాబ్ ఆట తీరును అంత తక్కువా అంచనా వేయొద్దని సీఎస్కే గుర్తించాలి.
ఇరు జట్లు..
సూపర్కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ, ఆరవెల్లి అవనీష్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఆర్ఎస్ హంగార్కర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సంత్నర్, నిచెల్ సంత్నర్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతిసా పతిరానా, సిమర్జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహిష్ తీక్షణ, సమీర్ రిజ్వీ.
పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్స్టోన్, అథర్వ తైడ్, అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్ప్రీత్ బ్రర్, రాహుల్ , హర్ప్రీత్ భాటియా, విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి రిలే రోసో.