Chandrababu :
సుప్రీం కోర్టులో సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు కు సంబంధించిన పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆయనపై అభియోగాలు మోపుతూ ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకొని కోర్టు తీర్పు మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించింది. రెండు రోజులు కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా చేపట్టింది. అయితే ఈ కేసులో చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. చంద్రబాబుకు అరెస్టుకు ముందు గవర్నర్ అ నుమతి తీసుకోలేదని, సరైన ప్రమాణాలు పాటించలేదని, చంద్రబాబు పాత్ర ఉందని ఆధారాలు లేవని, ఇలా పలు కోణాలో వాదించింది. అయితే ప్రతివాదులుగా ఉన్న సీఐడీ ఏఏజీ వాదనలు విన్న ఏపీ హైకోర్టు వారి అభిప్రాయంతో ఏకీభవించింది. క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది.
ఇక దీనిపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు పాత్ర ఇందులో లేదని, ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితోనే ఆయనపై కేసులు పెట్టిందని సుప్రీంలో లాయర్లు వాదించనున్నారు. ఆయన వయస్సు, భద్రత దృష్ట్యా రిమాండ్ ను కొట్టివేయాలని అడగనున్నారు. ఇక దీనిపై ప్రతివాదుల కౌంటర్లను కూడా సుప్రీం న్యాయస్థానం అడిగే అవకాశం ఉంది. మరి ఈ క్రమంలో చంద్రబాబుపై లాయర్ల వాదనతో సుప్రీం న్యాయమూర్తి సంతృప్తి చెందితేనే ఆయనకు ఊరట లభించనుంది. లేదంటే మళ్లీ చుక్కెదురయ్యే అవకాశం ఉంది.
ఏదేమైనా ఇప్పుడు సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంది. సుప్రీంలో న్యాయం జరుగుతుందని టీడీపీ శ్రేణులు, చంద్రబాబు లీగల్ టీం భావిస్తున్నది. లేదంటే చంద్రబాబు మరిన్ని రోజులు రిమాండ్ లో ఉండే అవకాశమున్నది. దీంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్నది.