37 C
India
Monday, May 20, 2024
More

    YCP : ఓట్ల గల్లంతు వ్యవహారంలో దోషిగా వైసీపీ.. చంద్రబాబు ఫిర్యాదుతో ఉలికిపాటు

    Date:

    jagan chandrababu
    jagan chandrababu

    YCP : ఏపీలో అధికార పార్టీ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అధికారంలో ఉన్నాం కదా.. అని అక్రమాలకు తెరదీశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా అందిన కాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారంలోకి రావాలని కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో దొంగ ఓట్ల వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై టీడీపీ పోరాటం చేస్తున్నది. ఇప్పటికే ఈ వ్యవహారం ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు.

    ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఏమవుతుందోనని భయంతో తాము అధికార పార్టీ అని కూడా మరిచిపోయి వైసీపీ ఎంపీలు కూడా సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఉరవకొండ నియోజకవర్గంలో ఈ అక్రమాలు బయటపడి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.  అయితే ఇప్పుడు మరోసారి ఆధారాలతో టీడీపీ ఢిల్లీకి వెళ్లడంతో, వైసీపీలో వణుకు మొదలైంది. అయితే 2014 నుంచి వైసీపీనే మొదటగా ఓటర్ల గల్లంతు అనే స్ర్టాటజీని మొదలుపెట్టింది. అప్పుడు ఢిల్లీలో పెద్ద హడావుడే చేసింది. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. అయినా కూడా వైసీపీనే ఎదురు దాడి చేస్తున్నది. దొంగే దొంట అన్నట్లు అరుస్తున్నట్లుంది వైసీపీ పరిస్థితి.

    వైసీపీ నేతలు కొంతకాలంగా ఢిల్లీలో వ్యవస్థలను మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తున్నది. రాష్ర్టంలో చంద్రబాబును బద్నాం చేయడానికి వారు చేయని ప్రయత్నమే ఉండదు. మొదటి నుంచి జగన్ స్ర్టాటజీ అదే విధంగా ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తు్న్నది. తప్పు వైసీపీ నుంచి ఉన్నా మీరు చేయలేదా అంటూ టీడీపీని నిందించే ప్రయత్నం చేస్తుంటారు. ఏదేమైనా ఓట్ల తొలగింపులో వేళ్లన్నీ ప్రభుత్వం వైపు చూపిస్తున్నా తీరు మార్చుకోకపోవడం, ప్రశ్నిస్తున్న టీడీపీ ని నిందించే ప్రయత్నం చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. అయితే ఢిల్లీలో మీడియా మిత్రులు సాక్షాలు అడిగితే టీడీపీ కొన్నింటినీ అందించింది. ఇక వైసీపీ ఎంపీలు మాత్రం మా దగ్గర లేవు.. మళ్లీ ఇస్తాం అంటూ మాట దాటే శారు. ఇదే వారి పరిస్థితికి అద్దం పడుతున్నది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...