37.3 C
India
Tuesday, May 21, 2024
More

    Zero Current Bill : నేటి నుంచి జీరో కరెంట్ బిల్లు.. మొదట ఎక్కడంటే..

    Date:

    Zero Current Bill
    Zero Current Bill

    Zero Current Bill : ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రెండు హామీలను పట్టాలెక్కించిన రేవంత్ సర్కార్ తాజాగా మరో రెండు గ్యారెంటీలను అమలులోకి తెచ్చింది. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ను అర్హులకు అందించనుంది. మార్చి 1వ తేదీ(నేడు)నుంచి ఈ పథకం అమల్లోకి వస్తోంది. ఈ రోజు నుంచే విద్యుత్ కస్టమర్లకు జీరో బిల్లులు జారీ కానున్నాయి.

    ప్రజాపాలన దరఖాస్తులలో అప్లై చేసుకున్న వారికి ఉచిత విద్యుత్ అందించనుంది. విద్యుత్ సిబ్బంది మీటర్ చెక్ చేసి 200లోపు యూనిట్లు ఉన్నవారికి జీరో బిల్లు జనరేట్ చేసి బిల్లు ఇవ్వనున్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్నవారిని అర్హులుగా నిర్ణయించింది. ఈ పథకాన్ని ఇటీవలే సచివాలయంలో సీఎం రేవంత్ మంత్రులతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

    నేటి నుంచి హైదరాబాద్ పరిధిలో గృహజ్యోతి కింద జీరో కరెంట్ బిల్లులు ఇవ్వనున్నారు. ఇందుకోసం బిల్లింగ్ యంత్రాల సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. రేషన్ కార్డు ఉండి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడితేనే ఇది వర్తిస్తుంది. ఈ జీరో బిల్లులో యూనిట్లు, బిల్లు ప్రింట్ చేసి.. గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లును మాఫీ చేసి జీరోగా చూపిస్తారు. త్వరలోనే ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలుకానుంది.

    కాగా, అర్హులుగా రేషన్ కార్డు దారులనే నిర్ణయించగా..రేషన్ కార్డులేనివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో పేదలమైన తమకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నామని అంటున్నారు. వెంటనే తమకు రేషన్ కార్డులు పంపిణీ చేసి ఉచిత కరెంట్ కు అర్హులుగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Ashu Reddy : ఫొటో గ్యాలరీ: ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న ఆశు రెడ్డి హాట్ పిక్స్  

    Ashu Reddy : రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన అశురెడ్డి...

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...