తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆద్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ అమెరికాలోని న్యూజెర్సీలో మే 15 న జరుగనున్నాయి. మే 15 ఆదివారం రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఇక పోటీలలో పాల్గొనేవాళ్ళు ఎంట్రీ ఫీజుగా 150 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. విజేతలకు 1200 డాలర్లు బహుమతిగా అందించనున్నారు.
అలాగే రన్నరప్ జట్టుకు 600 డాలర్లు అందించనున్నారు. అమెరికాలో ఉంటున్న తెలంగాణ వాళ్ళు అలాగే తెలుగువాళ్ళు ఈపోటీలలో పాల్గొననున్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని మరింతగా పెంపొందించడానికి అలాగే నిత్యం రకరకాల పనులతో బిజీగా ఉండేవాళ్ళకు ఈ పోటీలు తప్పకుండా సరికొత్త జోష్ ని తీసుకు వస్తాయని భావిస్తున్నారు నిర్వాహకులు.