Criticism on AP Police : కొంతకాలంగా ఏపీ పోలీసులు తరచూ విమర్శల పాలవుతున్నారు. అవసరం లేని అతితో ప్రజా క్షేత్రంలో విలన్లుగా నిలుచుంటున్నారు. అయితే కొందరు మాత్రమే అతి చేస్తుంటే,, మిగతా పోలీసులకు కూడా ఇదంతా తాకుతున్నది. ఏపీలో పోలీస్ వ్యవస్థ మొత్తం అధికార వైసీపీ కి దాసోహం అంటున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే తప్పెవరిదైనా కేసులు మాత్రం ప్రతిపక్ష నేతలపైనా, బాధితులపైనే అన్నట్లు ఉంది ఏపీలో పరిస్థితి. ఇక్కడ కొంత కాలంగా కేసుల పరిస్థితి చూసినా అదే విధంగా ఉంది. అయితే ఇప్పుడు దసరా సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు రాశారు అంటున్న లేఖ ఒకటి వైరల్ అయ్యింది. ఆయన జైలు నుంచి రాసినట్లుగా ఓ లేఖ వైరల్ అయ్యింది. అయితే దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యిందట. దీంతో ఏపీ డీజీపీనే స్పందించారు. ఈ లేఖ అంశంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అయితే జైలు నుంచి ఎలాంటి లేఖ వెళ్లలేదని జైళ్ల శాఖ చెప్పింది.
ఇక చంద్రబాబు లేఖ రాశారనే విషయమై విచారణ చేపడుతున్నట్లు ఏపీ డీజీపీ ప్రకటించారు. అయితే టీడీపీ వాళ్లు ఏ పని జేసినా కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం చెప్పినట్లుగా ఉంది పరిస్థితి. కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసిన సమయంలోనే ఆయన చెప్పిన అంశాలతో ఈ లేఖ సిద్ధం చేసి ఉండవచ్చు. దీనికి కూడా రాద్ధాంతం ఎందుకని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ నేతల కోసం ఇంతలా పోలీస్ వ్యవస్థను నవ్వుల పాలు చేసేలా ప్రయత్నించడంపై మండిపడుతున్నారు. అందరు పోలీసులు ఇలా లేకున్నా, కొందరితో అందరికీ మచ్చ వస్తున్నదని బాధపడుతున్నారు.